మెరుపుకలలు సినిమాలో "అపరంజి మదనుడే" అనే పాటలో పాటలో వేటూరి గారు "కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే" అని రాసారు. ఏసు గురించిన పాటలో శిశుపాలుడు ఎందుకొచ్చాడు? కన్నీటి గాయాలు చన్నీటితో కడగటం వెనుక ఏమైనా కథ ఉందా లేక తాను ఇచ్చిన ట్యూనుకి అనుగుణముగా పదాలని ఇరికించాల్సినదే అని మెడమీద కత్తిపెట్టిన రెహ్మానుడి కోసం రాసిన పదాలా ఇవి?వేటూరిగారు మరీ ఇలా తలా తోకా లేకుండా రాస్తారా?ఏసుని,శిశుపాలుడిని కలపడం ఏమిటి?లేకపోతే ఇది "శిశుబాలుడు" అని రాస్తే గాయని "శిశుపాలుడు" అని పాడిందా?మ్యూజికాలజిస్టు రాజా గారు "శిశిపాలుడు" అని ఇచ్చారు తన బ్లాగులో.మళ్ళీ ఇదో సందేహము,శిశిపాలుడు అంటే అర్ధం ఏమిటని.
అలాగే కన్నీటిని చన్నీటితో కడగడం అంటే?