Wednesday, February 24, 2010
Saradaaki-16
Monday, February 22, 2010
Saradaki 15
Sunday, February 7, 2010
Saradaaki-14
ఎక్కాలు,గ్రామరు కొన్నాళ్ళకి నాన్నగారు చవమని చెప్పటం మానేసారు.అయినా సరే,శెలవు రోజున పొద్దునే ఇంట్లో తప్ప బయట ఆడుకునే చాన్సు లేదు.
నీ మీద ఎంత ఇదో నాన్నగారికి,చిన్ని పేచి పెడుతుందేమో అని ఇంట్లొ అన్నీ ముందే తెచ్చి పెట్టేవారు తెలుసా అని పెద్దయ్యకా మా అమ్మ నా చెవిన తీరికగా వెసిందనుఖొండీ.కొన్ని సంవత్సరాల ముందు చెప్పచ్చు గా ఈ చల్లని మాట.
నాన్నగారిని ఎదయినా డైరెక్టు గా అడగాలన్నా భయమే.అమ్మకి చెప్తే సాయంత్రం నాన్నగారి చెవిన వేసేది.నాన్నగారు ఒప్పుకుంటారో లెదో అని మళ్ళా టెన్షను షురూ.నాన్నగారికి ఎదురుగా వెళ్ళే ధైర్యం చెయ్యలేక గోడచాటున సోషలు పుస్తకం పట్టుకుని కూర్చునేదానిని.ఇలాంటి సీను కి మాత్రం సోషలు భలే పనికొచ్చెదిలే.పుస్తకం లో తలవాల్చి నాన్నగారి మాటలు వినచ్చు.లేదంటే పరీక్షలప్పుడు తప్ప ఎప్పుడూ ఆ పుస్తకం తీసి ఎరుగను.మొత్తానికి ఆయన టీ తాగటం కంప్లీటు ఆయ్యేలోపు యస్ ఆర్ నో చెప్పేసేవారు.చూద్దాం అని అన్నారంట మళ్ళీ టెన్షను నాకు.ఎంటో పెద్ద ఇది అవును కాదు చెప్పటానికి అనుకునేదానిని కూడా.
పెద్దయ్యాకా కాని తెలియలేదు ఆయన ఎంత కష్టపడి మమంల్ని పెద్ద చదువులు చదివించారో.సామాన్య గుమాస్తాగా వున్నప్పుడే ఇద్దర్ని హాస్టల్ లో పెట్టి చదివించారు అని తలచుకుంటేనే కళ్ళళ్ళో నీళ్ళు తిరుగుతాయి.
ఇంత సంపాదిస్తూ కూడా(ఎట్లీస్ట్ ఆయన కంటే బెటర్ గా సంపాదిస్తూ)వున్న ఒక్కడిని పెంచటానికే నేను ఎంత ఆలొచిస్తానో.అలాంటిది నాన్నగారేమో...తలచుకుంటేనే హీ ఈజ్ గ్రేట్ అనిపిస్తుంది,ముగ్గురిని ఏ లోటూ లేకుండా ఎలా పెంచారా అని.అమ్మకి కూడా హ్యాట్సాఫ్ ఆ విషయంలో.
ఎలాంటి పరిస్థుతులలోనూ తొణకని ఆయన నిబ్బరం తలచుకుంటే ముచ్చటేస్తుంది నాకు,నాకు కొంచమయినా రాలేదే అని కూసింత బాధ కూడా వస్తుంది.
ఇక ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కాని,ఆయన ధైర్యం కాని నిజం గా గ్రేట్ అనిపిస్తుంది నాకు.అన్నింటికంటే కూడా..నేను ఇష్తపడ్డాను అనే ఒక్క కారణంతో తాను ఎన్నో అవమానాలు పడీ కూడా నా పెళ్ళి జరిపించిన ఆయన ధైర్యం అపూర్వం.
అలాంటి మా నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు,సుఖమయ జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ...
saradaaki-13
నా చిన్నప్పటి లెక్కలు అంటే మొదట గుర్తొచ్చెది ఎక్కాలే.మా వాడిని ప్రీ స్కూలు నుండీ చూస్తున్నాను,ఎక్కడా ఎక్కాల ఊసే లేదాయె.అలా నా మనసు చిన్నతనంలోకి వెళ్ళిపోయింది.
శెలవలు వచ్చయంటే చాలు ఎక్కాలు చదవాల్సిందే ఇరవయ్ ఇరవయ్ ల వరకు.మా నాన్నగారు అంటే చచ్చె హడల్ నాకు.పొద్దునే తనతో కూర్చొబెట్టుకుని టిఫిన్ చేయించి ఆఫీసుకి వెళ్తూ అమ్మకి చెప్పివెళ్ళేవారు నెను వచ్చెవరకు చిన్ని కి అన్నం పెట్టకు అని.నేను వచ్చకా ఇరవయ్ ఇరవయ్ ల వరకు ఎక్కాలు అప్పజెప్పాలి అని సింపుల్ గా అనేసి స్కూటర్ మీద తుర్రుమనే వారు.ఇక చూడాలి నా బాధ.ఎన్ని సార్లు చదివినా రావె ఆ ఎక్కాలు.అసలు ఇంట్రస్టు వుంటే కదా వంట పట్టేది ఏదయిన కాని.ఎప్పుడు అవసరం అయితే అప్పుడు గుణిచుకోవచ్చు కదా ఎమిటి ఈ తిప్పలు అనుకునే దానిని.ఒక పక్క అమ్మ పెట్టే పోపులు వాసన తగలగానే ఎక్కడ లేని ఆకలి పుట్టుకొచ్చెసెది.కాని నాన్న గారి రూలు ని అమ్మ ఎన్నడూ ధిక్కరించెది కాదు.ఆ విషయం లో మా అమ్మ మీద ఎంత కోపం వుండెదో నాకు.పైగా తానెదో సత్య హరిస్చంద్రుడి చెల్లెలి లెవెల్ లో నాన్నగారు రాగానే అన్ని చెప్పెది మా గురించి.ఇక అప్పుడు చూడాలి నా టెన్షను.అక్కకి ఎప్పుడూ పెద్ద టెన్షను పడ్డట్ట్లు అయితే నాకు గుర్తు లేదు.
ఎమీ మాట్లాడకుండా మాతో కూర్చుని మామూలుగా భొజనం చెసే వారు.పైగా తను కలిపి వేసినవి అన్నీ తినాల్సిందే.లేకపొతే చిన్నీ అని ఒక్కసారి పిలిచారంటే చాలు.నిమిషం లో కంచం మొత్తం ఖాళీ అయిపొయేది.
భొజనం చేసాకా అడిగేవారు ఎక్కాలు చదివావా అని.ఆ చదివా అండీ అని ఎంతో వినయం గా చెప్పేదానిని.కాని పదిహేడు పద్దెనిమిదులు ఎంత అనో మరోటో అదుగుతారెమో అని ఆ టయిము లో నేను పడ్డ టెన్షను ఇండియా పాక్ మ్యాచ్ అప్పుడు కూడా పడలెదంటే నమ్మండి.ఆయన భొజనం చేసాకా ఒక గంట అందరమూ పడుకోవాల్సిందే ఇంట్లో.
మళ్ళీ నానగారు తిరిగి ఆఫీసుకి వెళ్ళేటప్పుడూ ఎంత హ్యాపీ నో నేను.ఎకాల కార్యక్రమం ఆనాటికి పూర్తి అయ్యింది అని.ఎండ తగ్గితే కాని ఆటలకి పంపకు అని మరో ఆర్డరు వెసి వెళ్ళెవారు ఆఫీసుకి.
నాకేమో నాలుగింటి నుండే బయటకి వెళ్ళాలని వుండేది.అమ్మని ఎంత విసిగించేదానినో.నాన్నగారికి చెప్తాను అనేది చివరికి.ఇక తను వెళ్ళమనే వరకు ఆ మాట ఎత్తితే వొట్టు.నా మీద నాన్నగారు అనే వజ్రాయుధాన్ని ఎప్పుడూ ప్రయోగించాలో తనకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు.
మర్నాడు పొద్దున్న మళ్ళీ సేం టూ సేం సీను.ఇరవయ్ ఇరవయ్ ల వరకు ఎక్కాలు చదవటం.అలా ఎన్ని సార్లు చదివానో లెక్క లేదు.కాని నాకు ఇప్పటికీ నోటికి మాత్రం ఎక్కాలు రావు.ఎదో నాన్న గారి కోసం చదవటం అంతే.ఇంకాస్త పెద్దయ్యాకా ఎక్కాల నుండి సీను ఇంగ్లీషు గ్రామర్ కి మారింది.
నాకు ఇప్పుడు నవ్వు వచ్చెది ఎమిటి అంటే చదవమని చెప్పేవారే కాని నాన్నగారు ఎప్పుడూ అప్పచెప్పించుకోలేదు.ఆ కిటుకుని పట్టుకోలేక నేనేమో తిట్టుకుంటూ ఎక్కాలు గ్రామరు చదివాను కదా అని.
మరలా కలుస్తా...
Tuesday, February 2, 2010
Saradaaki-12
లోకం లో మానవులకి తాత్విక చింతన బాగ తగ్గిపోతొందని అంటున్నారు పెద్దలు.కాని ఈరోజుల్లొ మన తీరు చూస్తోంటే కాస్త ఈ స్టేట్మెంటు ని మార్చాలేమో అనిపిస్తొంది.ఈ కింద పేర్కొన్న వాటినన్నింటిని మనము ఎన్ని సంవత్సరాలుగా వింటున్నమో ఎవరికయినా తెలుసా?
1)నిందితులు ఎవరినీ వదిలిపెట్టేది లెదు
2)నేరస్తులు ఎంతటి వారయినా సరే శిక్షిస్తాం.
3)ప్రభుత్వ పాతశాలలని కాన్వెంటులకి ధీటుగా తీర్చిదిద్దుతాము
4)గ్రామ గ్రామనికి మంచి నీరు అందిస్తాము
5)పారిశ్రామికంగా దెశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతాము
6)పొరుగు దేశం కవ్వింపు చర్యలని సహించేది లేదు.(ఇక చెప్తూ పోతే ఈ లిస్టు కి అంతు వుండదని లిస్టు ముగిస్తున్న).
ఊహూ తెలీదు.మంద చర్మం గాళ్ళము అయిపొయాము కదా గుర్తు కూడా వుండదు మనకి.మన షార్టు మెమరీ గురించి తెలుసు కాబట్టే మనకి ఇలాంటి నయకులు దాపురించారు.
ఇంకా పాథెటిక్ ఎమిటి అంటే ఏదయినా నేరానికి సంబంధించిన వార్త ఏ పేపర్లొ ఎలా వచ్చిందొ వీలుంటే చదువుతాము లెదా ఆ పేపరు చదివిన వాడితో డిస్కషన్ మొదలెడతాము.లెదా నేరము జరిగిన ఊరిలొ వున్న మన అన్న వదిన లెదా స్నెహితుడు/స్నేహితురాలికి అయినా సరే ఫోను చేసి లైవు న్యూసు వినందే మన ఆరటం తగ్గదు.ఎవరికయినా ఉత్సాహమే కదా తమ నుండి ఇంఫర్మెషన్ అడుగుతొంటే.సో,తమ పాండిత్యం అంతా ఉపయొగించి విన్న దానికి ఇంకాస్త మసల జోడించి మాంచి రంజుగా చెప్తారు.పొనీ మనము విని ఊరుకుంటామా అంటే అదీ లెదు.నాకు తెలుసు ఇలా అయిందిట అసలు విషయం ఇదీ అని చెప్పి డిటెక్టివ్ లాగ పోజు కొట్టందే మనకి తిండి సహించదాయే.
నేరాలు జరిగినప్పుడు చూడాలి మన చానళ్ళ ఆరాటం.దెశం లో చీమ చిటుక్కుమన్నా కాని అక్కర్లెని చెవులు వున్న మన సో కాల్డ్ జర్నలిస్టులు అక్కడ వాలిపొతారు.ప్రిపరెషను గట్రా ఎమీ అక్కర్లెదు కదా సొది చెప్పటానికి.ఇక వారికి వచ్చిన/నచ్చిన రీతిలో ఊదరగొట్తెస్తారు జనాలకి.ఇక పిల్లల కిడ్నాపు డ్రామాలయితే పండగే.
ఇక నాయకులు,హక్కుల సంఘలు(ఫలాన హక్కు సంఘం అని కాదు లెండి,ఈ మధ్య తినే హక్కు,తాగే హక్కు సంఘలు కూడా వచ్చెసయి కదా)చెసే హడావిడి అయితే చెప్పక్కర్లెదు.నిందుతలని చంపలి నరకాలి అన్న కొపం వస్తుంది మనకి కూడా.ఈ ఆవెశం మహా అయితే ఒక వారం వుంటుంది అంతే సుమా.తరువాత మామూలే.శ్రీలక్ష్మి కేసు నుండీ ఈ తంతు చూస్తున్నదే కదా.
ఒక వారము తరువాత ఎవరికీ గుర్తు వుండదు ఏ విషయము కూడా.అప్పుడు చెసిన వాగ్దానలు నెరవేర్చరెమిటి అని కాని లెదా ఫలాన కేసు నిందితులని ఏమి చేసరు అని కాని ప్రశ్నించటం మర్చిపొయిన మన జర్నలిస్టులు పొరపాటున కూడా ప్రశ్నిచరు.జర్నలిస్టులందరూ కాశి కి వెళ్ళి వదిలేసి వచ్చిన వాటిల్లో ప్రశ్నించటం కూడా వుందని నా ప్రగాఢ నమ్మకం.
దేనినీ పట్టించుకోకుండా ఇలా జీవితాన్ని గడిపెస్తున్నాము అంటే తాత్విక చింతన అలవడినట్లా కాదా?