Friday, March 11, 2011

ఇలా చేస్తే?

మొదట ఒక చిన్న డవుటు,ట్యాంకు బండు మీద పోతన విగ్రహం ఉంది కదా!ఆ విగ్రహాన్ని కూల్చలేదెందుకో,ఆయన వరంగల్ కి చెందిన వాడనా? అలాగే రుద్రమ దేవి మీద కూడా సేం డవుటు.ఆన్ లైన్ లో లభ్యమైన వార్తల ప్రకారం ఇవి ధ్వంసం కాలేదు.
(కవులు కళాకారులకేనా ప్రాంతీయ తత్వం ఆపాదించడం? మున్ముందు ప్రత్యేక వాదుల పైత్యం ఇంకాస్త ముదిరి సీమాంధ్రులని యాదగిరిగుట్ట,భద్రాచలం రావద్దు అంటారేమో కూడా.)

ట్యాంకు బండు మీద విధ్వంసానికి తెగ బాధ పడిపోతున్నాము కానీ అవసరమా చెప్పండి.మనకి ఇది కొత్తా కాదు మరలా జరగదు అని కూడా చెప్పలేము.మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే పై చేయి చేసుకున్నారు,అంతకముందు నోటికొచ్చినట్లు మాట్లాడారు. నిన్న ఇక సహనాన్ని పరీక్షిస్తూ ఈ విధ్వంసం స్రుష్టించారు.

ఇలాంటి వాటి తరువాత ఏమి జరుగుతుంది?

నిందితలని కఠినం గా శిక్షిస్తాము అనే ప్రకటన యధావిధి గా గ్రుహ మంత్రిణి నుండి వెలువడుతుంది. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమే,తక్షణమే రాజీనామా చెయ్యాలి ముఖ్య మంత్రి అని ప్రతిపక్షాలు గొంతు చించుకుంటాయి.మనము ఇలా టపాలు రాసుకుంటాము,టీవీలలో చర్చలు, రచ్చలు జరుగుతాయి,మండే కల్లా మన గుండె మంట చల్లారుతుంది,మళ్ళా మామూలే.

ఇంత గొడవలో తమని విస్మరించారనుకున్నారేమో ఈరోజు సమైఖ్యాంద్ర ఐకాసా వారు వార్నింగ్ ఇచ్చేసారు విగ్రహాలని పునః ప్రతిష్టించకపోతే ఉద్యమం ఉధ్రుతం చేస్తాము అని. వీళ్ళెప్పుడయినా ఉద్యమం చెయ్యగా ఎవరైనా చూసారా?

అయ్యిందేదో అయ్యింది,అసెంబ్లీ లో తీర్మానం పెడదాము ప్రత్యేక రాష్ట్రం కోసం అని సింపుల్ గా ఓ సలహా పారేసారు ఇంకో ప్రజాప్రతినిధి గారు. తమ మత విశ్వాసాలకి సంబంధించిన కట్టడం మీద ఈగనైనా వాలనీయని ఆ పెద్ద మనిషి,తమ వారిని అదుపులోకి తీసుకున్నారు ని తెలియగానే అర్ధరాత్రైనా స్టేషన్ కి వెళ్ళి విడిపించుకునే మత మూర్ఖత్వాన్ని అణువణువునా జీర్ణించుకున్న ఆ పెద్ద మనిషి కి ఏమి తెలుస్తుంది,ఎలా చెప్తే అర్ధం అవుతుంది సాంస్కౄతిక వైభవం అంటే?


నిన్న న్యాయవాదులని అక్రమం గా నిర్భందించారుట అందుకని అక్కడెక్కడొ న్యాయవాదులు విధుల బహిష్కరణ. ఏమిటిది?పోలీసులు వద్దు అని చెప్పినా కానీ విధులకి డుమ్మా కొట్టి మరీ రావడమే తప్పు,అరెస్టు చేసారని మరలా విధులు బహిహ్కరించి పౌరులని ఇబ్బంది పాలు చెయ్యడమా?మనకి అవసరపడితే కానీ తెలీదు న్యాయవాది విలువ. ఆ న్యాయవాదుల కోసం ఎంత మంది ఎదురుచూస్తూ ఉంటారు పాపం?

ఇప్పుడే స్క్రోలింగు చూసా, మన జర్నలిస్టు తమ్ముళ్ళు పాలాభిషేకం చేసేరుట పాక్షికంగా కూలిన ఏదో విగ్రహానికి.
థాంక్యూ తమ్ముళ్ళూ,ఇన్ని రోజులూ నాకు పాలాభిషేకాలు,పెరుగు అర్చనలు ఇలాంటివి రాజకీయ నాయకులని గుడ్డిగా నమ్మే చిన్న చితకా పని లేని నాయకుల ఆధ్వర్యం లోనే జరుగుతాయి కాబోలు అనే భ్రమ ఉండేది. నా భ్రమ ని పటాపంచలు చేసి హుస్సేన్ సాగర్ లో వేసేసారుగా.

జర్నలిస్టులకి ప్రజా గాయకుడు,ప్రొఫెసర్ గారు క్షమాపణ చెప్పారుట వారి మీద దాడి జరిగినందుకు.మరి వారు కూల్చేసిన విగ్రహాల సంగతేంటో?ఎండనకా వాననకా పని చేస్తూ, మదపుటేనుగుల్లా ప్రవర్తించే ఆందోళన కారుల రాళ్ళ వర్షాన్ని,వారి దాడిని కేవలం పాత కాలపు ఆయుధాలతో కాచుకునే పోలీసులు గుర్తుకు రారెందుకో మరి క్షమాపణ అడగడానికి.

(స్వగతం: ఛీ ,వెధవ ఎమ్మెన్సీ లో ఉద్యోగాలు,ఒక్క సమ్మే చెయ్యడానికుండదు,ఒక్కడు సారీ చెప్పడు)

సరే,విగ్రహాలకి ప్రాణం లేదు ఒప్పుకుంటున్నాము భాయ్, మీ గులాబీ భవనం లో ఉన్న విగ్రహానికి ఏమైనా అయితే ఇలాగే అనేవారా?


విగ్రహాల సంగతి వదిలెయ్యండి,జైళ్ళలో మగ్గుతున్న విద్యార్ధుల సంగతి చూడండి అని ఇంకో మేధావి సింపుల్గా శలవిచ్చారు.వెళ్ళి ఉద్యమం లో పాలుపంచుకో నాన్న,నీకు ఉద్యోగం వస్తుంది అని ఏ తల్లీ తండ్రీ చెప్పి పంపరు ఈ విద్యార్ధులని.క్యాంపస్ లో సీటంటే మాటలు కాదు. అసలు విలువ లేకుండా పోతోంది వీళ్లకి చదువంటే. ఏమన్నా అంటే అధ్యాపకులని చితక్కొట్టి హీరోలయ్యామనుకుంటున్నారు.మెల్లిగా చెప్తే తలకి ఎక్కదు కానీ వీరిని ఎంత కాలం వీలైతే అంత కాలం జైళ్ళలోనే మగ్గనిస్తే బాగుటుంది.నేరస్తులకి ఏ మాత్రం తీసిపోరు వీళ్ళు. అప్పుడు కోర్టులనీ వాయిదాలనీ తిప్పేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోయి వీరి చదువు అటకెక్కుతుంది.అప్పుడైనా బుద్ధొస్తుందేమో.

ఈరోజు మనజర్నలిస్టులు రాజకీయ నాయకులని బహిష్కరించారుట అసెంబ్లీ లో. మంచిది. అదే పని మీరు నిన్న ఆ మార్చ్ కవరేజ్ కి చేసుంటే బాగుండేది కదా. మేము లేకపోతే మీకు న్యూస్ ఎలా వస్తుంది అని హూంకరిస్తున్నారా? అక్కడికే వస్తున్నా.పనికిరాని నాయకుల పేర్లు సామాన్య ప్రజానీకానికి తెలిసిందే మీ వల్ల,మీరు వారికిచ్చే అనవసర కవరేజ్ వల్ల.మీడియా మైకులని,కెమేరాలని చూడగానే ఒళ్ళు మరచి మాట్లాడతారు కదా మన నాయకులు. అదే మీరు వారిని పూర్తిగా విస్మరించారనుకోండి,మహా అయితే ఒక ఛానెల్,ఒక పేపర్ లో వస్తుంది ఈ వార్త అంతే కదా. కవరేజ్ రాకపోయేసరికి వీళ్ళకి కిక్కుండదు. ప్రత్యేక వాదులే కాదు,సమస్యలు వదిలి అనవసరం గా రోడ్డెక్కే ఎవరి మీదైనా ఈ అస్త్రాన్ని ప్రయోగించి చూడండి.

మీరు కవరేజ్ ఇవ్వబట్టే కదా,పాలిటెక్నిక్ కుర్రాడు ప్రేమ విఫలమయ్యిందనో,మరొకడు పక్కింటివాడు గోడ కాస్త పక్కకి జరిపాడనో బిల్డింగులు,టవర్లూ ఎక్కి బెదిరింపులు సాధారణమయ్యాయి.

ఒక్కసారి మానేసి చూడండి ఇలాంటి పనికిమాలిన ఆందోళనలని,ప్రజలకి అసౌకర్యం కలిగించే ధర్నాలు,రాస్తారోకోల కవరేజ్ ని.
(ఇలాంటివి మానెస్తే మీరు,మీ వాహనాలు కూడా సురక్షితం)

నిజంగా మీకు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అనేక సమస్యలున్నాయి నిరుపేదలకే కాదు మధ్య తరగతి వారికి కూడా.వాటి మీద మీ ఫోకస్ పెట్టండి.అంతే కానీ ఇలాంటి ఆందోళనలు జరుగుతున్నప్పుడు ఇంకా ఆవేశం గా కవరేజీ ఇవ్వడం,రెండు వేలు లంచం తీసుకుంటున్న చిరుద్యోగి మీద కధనం గొప్పతనం కాదు.

2 comments:

  1. "వీరిని ఎంత కాలం వీలైతే అంత కాలం జైళ్ళలోనే మగ్గనిస్తే బాగుటుంది."

    అయ్యయ్యో అప్పుడెలా అండీ. వీళ్ళ మీద కేసులేత్తేయాలని మళ్ళీ నిరాహార దీక్ష చేయాలి. ఆ క్రెడిట్ కోసం వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చావాలి. క్రెడిట్ రానివాడు మరో ఈవెంట్ కి పిలుపివ్వాలి. వీళ్ళని గుడ్డిగా గొర్రెల్లా నమ్మే స్టూడెంట్స్ అందులోనూ రెచ్చిపోవాలి. మళ్ళీ కేసులు, దీక్షలు, క్రెడిట్ కోసం ఆరాటాలు .......ఇదంతే విష వలయం

    ReplyDelete
  2. శంకర్ గారూ,

    :))

    ReplyDelete